శ్రీలంక విజయకేతనం

17 Dec, 2017 08:31 IST|Sakshi

సెంచరీతో కదం తొక్కిన దిమంతు 

అనంతపురం న్యూసిటీ: ఫాదర్‌ విన్సెంట్‌ ఫెర్రర్‌ ఇన్విటేషన్‌ క్రికెట్‌ టోర్నీలో శ్రీలంక జట్లు రాణించాయి.  శనివా రం అనంతపురం క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లలో అనంతపురం జట్లపై శ్రీలంక జట్లు గెలుపొందాయి. శ్రీ లంక బ్యాట్స్‌మెన్‌ దిమంతు సెంచరీతో కదం తొక్కాడు. 
సునాయాసంగా: అండర్‌ –12 విభాగంలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ శ్రీలంక జట్టు సునాయస విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన అనంతపురం జట్టు నిర్ణీత 30 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. జట్టులో భానుప్రకాష్‌ 81(12 బౌండరీలు), మనోజ్‌కుమార్‌ 52 పరుగులతో రాణించారు.

 శ్రీలంక జట్టు 29.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జట్టులో దిమంతు సెంచరీ 86 బంతుల్లో 15 బౌండరీలతో 109 పరుగులు చేశాడు. అనంతపురం బౌలర్లలో సునీల్, సాత్విక్, ఆర్యన్‌ చెరో వికెట్‌ తీసుకున్నారు. శ్రీలంక జట్టు 4 వికెట్లు తేడాతో గెలుపొందింది.కుప్పకూలిన అనంతపురం: అండర్‌ –14 విభాగంలో మొదట బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక జట్టు 30 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. జట్టులో స్వేత్‌ 35, ఓమెత్‌ 27, మోనీష్‌ 22 పరుగులు చేశారు.  అనంతపురం జట్టు 26 ఓవర్లలో 105 పరుగులకే కుప్పకూలింది. 44 పరుగుల తేడాతో అనంతపురంపై  శ్రీలంక జట్టు గెలుపొందింది.  

మరిన్ని వార్తలు