మహానందిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి

12 Dec, 2015 13:35 IST|Sakshi

కర్నూలు జిల్లాలోని మహానందిలో కొలువైన కామేశ్వరిదేవీ సమేత మహానందీశ్వరుడిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ శనివారం ఉదయం దర్శించుకున్నారు. ఆయనతో పాటు వచ్చిన న్యాయమూర్తుల బృందానికి ఆలయ ఏఈవో మధు, వేద పండితులు స్వాగతం పలికారు. జస్టిస్ జాస్తి చలమేశ్వర్ వెంట నంద్యాల జడ్జి యూ రామ్మోహన్, కర్నూలు ఎక్సైజ్ మేజిస్ట్రేట్ రాజు, నాంపల్లి అదనపు జిల్లా న్యాయమూర్తి ప్రవీణ, హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి శంకర్ తదితరులు ఉన్నారు. స్వామి దర్శనం అనంతరం వారు అహోబిలం వెళ్లారు.



 

మరిన్ని వార్తలు