సాక్షి, హైదరాబాద్ : సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది పీపీ రావు (84) కన్నుమూశారు. ఢిల్లీలోని ఇండియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో చికిత్స పొందుతూ ఆయన బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. పీపీరావు పూర్తి పేరు పావని పరమేశ్వరరావు. ఆయన స్వస్థలం ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం మొగలిచర్ల. 2006లో ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రదానం చేసింది.
కాగా పీపీ రావు మృతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన పీపీరావు న్యాయవాదిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని, ఆయన సేవలు చిరస్మరణీయమని ఆయన తన సంతాప సందేశంలో కొనియాడారు. పలు జాతీయ, అంతర్జాతీయ కమిటీలు, వేదికల్లో భాగస్వామ్యులై నిర్వహించిన పాత్ర ఎనలేనిదన్నారు. పీపీరావు కుటుంబ సభ్యులకు జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
— YSR Congress Party (@YSRCParty) 13 September 2017