ప్లాస్టిక్ వ్యర్థాలవల్ల సముద్రానికి తీరని నష్టం వాటిల్లుతోందని కృష్ణపట్నం ఇండియన్ కోస్ట్గార్డ్స్ కమాండెంట్ వేణు మాధవ్ తెలిపారు. శనివారం కోస్టల్ క్లీనప్ డే సందర్భంగా కృష్ణపట్నం రేవులోని సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు పెను సవాలుగా మారిన ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే కార్యక్రమం యుద్ధప్రాతిపదికన చేపట్టామన్నారు.