పోలీస్ కస్టడీ నుంచి దొంగ పరార్

9 Nov, 2015 09:36 IST|Sakshi

కృష్ణా జిల్లా: పోలీసుల కళ్లు కప్పి కస్టడీలో ఉన్న ఖైదీ పరారైన సంఘటన కృష్ణాజిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. నల్లగొండకు చెందిన ఒక దొంగను మరో కేసు దర్యాప్తు నిమిత్తం ఏలూరుకు బస్సులో తరలిస్తున్నారు. బస్సు కీసర టోల్‌ప్లాజా వద్ద ఆగగానే పోలీసుల కళ్లు కప్పి పరారయ్యాడు. దీంతో పోలీసులు అతని కోసం గాలింపు చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

మరిన్ని వార్తలు