ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు

10 Sep, 2016 09:01 IST|Sakshi
ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు మూడోరోజు ప్రారంభం అయ్యాయి. శనివారం సభ ప్రారంభం కాగానే ప్రత్యేక హోదాపై చర్చించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించి, ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు.

దీంతో విపక్ష సభ్యులు హోదాపై చర్చ జరిగాల్సిందేనని పట్టుబట్టారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి తమ నిరసన తెలిపారు. గత రెండు రోజులుగా ప్రత్యేక హోదా అంశం అసెంబ్లీని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు కూడా వైఎస్ఆర్ సీపీ ఎమ‍్మెల్యేలు నల్ల దుస్తులు ధరించి సభకు హాజరయ్యారు. కాగా ఇవాళలో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి.
 

మరిన్ని వార్తలు