నేటి ప్రజాసంకల్పయాత్ర ఇలా...

26 Sep, 2018 07:04 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రొగ్రామ్స్‌ కమిటీ కోఆర్డినేటర్‌ తలశిల రఘురాం వెల్లడి

సాక్షిప్రతినిధి, విజయనగరం: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేçపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా బుధæవారం జరగబోయే పాదయాత్ర వివరాలను ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రొగ్రామ్స్‌ కమిటీ కోఆర్డినేటర్‌ తలశిల రఘురాం తెలిపారు. బుధవారం ఉదయం 7.30 గంటలకు ప్రారంభమయ్యే ప్రజాసంకల్ప యాత్ర సాయంత్రం 6.30 గంటలకు వరకు కొనసాగుతుందని తెలిపారు. శృంగవరపుకోట నియోజకవర్గం లక్కవరపుకోట మండలంలోని రంగరాయపురంలో మొదలై కొట్యాడ వరకు కొనసాగుతుందన్నారు. 7.30 గంటలకు రంగరాయపురం నుంచి బయలు దేరి సంతపేట, లక్కవరపుకోట, ఖాసాపేట వరకు కొనసాగుతుందని అక్కడ భోజన విరామం ఉంటుందన్నారు. మధ్యాహ్నం 2.45 గంటలకు తిరిగి ప్రారంభమై కూర్మవరం క్రాస్, తలారి, మీదుగా సాయంత్రం 6.30 గంటలకు కొట్యాడ చేరుకుంటారని వివరించారు. అక్కడే జగన్‌మోహన్‌రెడ్డి రాత్రి బస చేస్తారని ఆయన తెలిపారు.

>
మరిన్ని వార్తలు