ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం

12 Dec, 2019 08:59 IST|Sakshi

లారీ-తుఫాన్‌ ఢీ.. నలుగురు మృతి 

సాక్షి, ప్రకాశం: జిల్లాలోని కొనకలమిట్ల సమీపంలో గురువారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న తుఫాన్‌ వాహనం, లారీ పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని పొదిలీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు బల్లారి నుండి చీమకుర్తికి తుఫాన్‌ వాహనంలో వెళ్తుండగా మార్గమధ్యంలో ప్రమాదం జరిగింది. తుఫాన్ డ్రైవర్‌ అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అంటున్నారు. మృతులు కర్ణాటకకు చెందిన వారని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు