29న టీఆర్‌ఎస్ ‘దీక్ష దివస్’

26 Nov, 2013 00:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ 2009లో ఆమరణ దీక్ష మొదలు పెట్టిన రోజుకు గుర్తుగా టీఆర్‌ఎస్ పార్టీ ఈ నెల 29న మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయిలో ‘దీక్ష దివస్’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు వెల్లడించారు. మాజీ మంత్రి కడియం శ్రీహరితో కలిసి సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 30 నుంచి డిసెంబర్ 12 వరకు పార్టీ శ్రేణులకు రెండో విడత శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్టు కడియం శ్రీహరి తెలిపారు.              

మరిన్ని వార్తలు