విశాఖ, బెజవాడ స్టేషన్ల అభివృద్ధి ప్రాజెక్టు

9 Feb, 2017 02:43 IST|Sakshi
విశాఖ, బెజవాడ స్టేషన్ల అభివృద్ధి ప్రాజెక్టు

వీడియో లింక్‌ ద్వారా ప్రారంభించిన రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభు

సాక్షి, విశాఖపట్నం/రైల్వేస్టేషన్‌ (విజయవాడ): ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన స్టేషన్‌ పునరభివృద్ధి (రీ–డెవలప్‌మెంట్‌) ప్రాజెక్టును రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ ప్రభు బుధవారం సాయంత్రం ఢిల్లీ నుంచి వీడియో లింక్‌ ద్వారా ప్రారంభించారు.

ఈ ప్రాజెక్టు కింద దేశ వ్యాప్తంగా 400 రైల్వే స్టేషన్లను ఎంపిక చేయగా అందులో విశాఖపట్నం, విజయవాడ స్టేషన్లు కూడా ఉన్నాయి. విశాఖ స్టేషన్‌లో రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.

మరిన్ని వార్తలు