అద్దె ఇంటి కోసం వచ్చి... కత్తులతో బెదిరించారు

15 May, 2015 18:16 IST|Sakshi

నెల్లూరు : అద్దె ఇంటికోసం వచ్చిన నలుగురు వ్యక్తులు ఓ గృహిణిని కత్తులతో బెదిరించి... బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలోని భక్తవత్సల నగరంలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. దుండుగులు దోచుకెళ్లిన బంగారం విలువ రూ.1.15 లక్షలు ఉంటుందని బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

>
మరిన్ని వార్తలు