20 ఏళ్లయినా పర్మనెంట్‌ కాలేదు

17 Jul, 2018 08:49 IST|Sakshi

తూర్పుగోదావరి : తాను పెదపూడి ప్రభుత్వాస్పత్రిలో 20 ఏళ్లుగా స్వీపర్‌గా పని చేస్తున్నా నేటికీ ఉద్యోగం పర్మనెంట్‌ కాలేదని పెదపూడికి చెందిన కిల్లాడి నూకాలమ్మ జగన్‌ వద్ద వాపోయింది. ప్రస్తుతం రూ.2 వేలు జీతం ఇస్తున్నారని, చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పింది. ఉద్యోగం పర్మనెంట్‌ చేయడంతో పాటు జీతం పెంచాలని కోరింది.

మరిన్ని వార్తలు