సాక్ష్యాలతో సహా స్పష్టత ఇచ్చిన ద్వివేది..

13 Apr, 2019 14:18 IST|Sakshi

ఎల్లో మీడియా దుష్ప్రచారం, ద్వివేది ఓటువేసిన వీడియో విడుదల

సాక్షి, అమరావతి : రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఓటు వేయలేదంటూ టీడీపీ నేతలతో పాటు, ఎల్లో మీడియా దుష్ప్రచారంపై ఈసీ అధికారులు ఘాటుగా సమాధానమిచ్చారు. సీఈఓ ఓటు వేయడాన్ని సాక్ష్యాలతో సహా స్పష్టత ఇచ్చారు. ఈ మేరకు ద్వివేది ఓటు వేసిన వీడియోను ఈసీ అధికారులు శనివారం విడుదల చేశారు. 11వ తేదీ సాయంత్రం 4 గంటలకు ద్వివేది ఓటు వేసిన విషయం తెలిసిందే. అయితే ఈవీఎంలో సాంకేతిక లోపం కారణంగా ఆయన ఓటు వేయలేకపోయారంటూ ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే.
 

మరిన్ని వార్తలు