విశాఖపట్నం :ఆయనంటే వారికి ఎంతో అభిమానం..జగనన్న వస్తున్నాడని తెలుసుకుని వినూత్నంగా స్వాగతం పలకాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం మాకవరపాలెం మండలంలో తమ్మయ్యపాలెం గ్రామానికి చేరుకున్న జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఈ గ్రామానికి చెందిన యువతులు తమ చేతులపై జగనన్న అక్షరాలతో గోరింట పెట్టుకుని స్వాగతం పలికారు. జగనన్న మాతో సెల్ఫీ తీసుకున్నాడంటూ వారంతా మురిసిపోయారు.