సాక్షి, శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 333వ రోజు షెడ్యూల్ ఖరారైంది. ఆదివారం ఉదయం శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం నైట్ క్యాంప్ శిబిరం నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభిస్తారు.
అక్కడి నుంచి, వెంకటాపురం, మహదేవిపురం క్రాస్, గరుడకంది, చిన్బాదం మీదుగా పలాస-కాశిబుగ్గ వరకు జననేత పాదయాత్ర కొనసాగిస్తారు. పలాస-కాశిబుగ్గ వద్ద జరిగే బారీ బహిరంగ సభలో జననేత ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.