ప్రజాసంకల్పయాత్ర 171వ రోజు షెడ్యూల్‌

24 May, 2018 20:25 IST|Sakshi

సాక్షి, ఉంగుటూరు (పశ్చిమ గోదావరి జిల్లా) : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 171వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. శుక్రవారం ఉదయం నైట్‌ క్యాంపు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు.  పెద కాపవరం, చిన కాపవరం, గుమ్ములూరు, తరటావా మీదుగా కొనసాగనున్న పాదయాత్ర కొల్లపర్రుకు చేరుకున్నాక వైఎస్‌ జగన్‌ విరామం తీసుకుంటారు. లంచ్‌ క్యాంపు అనంతరం కొల్లపర్రు మళ్లీ పాదయాత్ర కొనసాగించనున్న వైఎస్‌ జగన్‌, అకివీడులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొంటారు. అజ్జుమూరులో శుక్రవారం పాదయాత్ర ముగించి, వైఎస్‌ జగన్‌ అక్కడే రాత్రికి బస చేస్తారు. సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన వారు జననేత జగన్‌ను నేరుగా కలుసుకుని మాట్లాడవచ్చు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ ఏపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

పెదకాపవరంలో ముగిసిన పాదయాత్ర
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో 170వ రోజు ప్రజాసంకల్పయాత్ర పెదకాపవరంలో ముగిసింది. గురువారం ఉదయం ఉంగుటూరు నియోజకవర్గంలోని సరిపల్లి శివారు నుంచి రాజన్న బిడ్డ, జననేత వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభించారు. అనంతరం ఉండి నియోజకవర్గంలోని ఆరేడు, ఉప్పులూరు క్రాస్‌ రోడ్డు, పాములపర్రు,  వెంకటరాజుపురం మీదుగా కొనసాగిన పాదయాత్ర పెదకాపవరం వరకూ కొనసాగింది. గురువారం పాదయాత్రను పెదకాపవరంలో ముగించిన వైఎస్‌ జగన్‌ రాత్రికి అక్కడే బస చేస్తారు.

మరిన్ని వార్తలు