రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్ సీపీ నేత మృతి

31 May, 2019 11:33 IST|Sakshi

సాక్షి కాకినాడ : తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎదుర్లంకకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వినోద్‌ వర్మ దుర్మరణం చెందారు. కె.గంగవరం మండలం పాతకోట వద్ద కారు అదుపు తప్పి డ్యామ్‌లో పడిపోయింది. యానం నుంచి కోటిపల్లి వెళుతుండగా ఈ ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాద సమాచారం తెలుసుకున్న ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ ఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వార్తలు