'రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది'

18 Jul, 2014 18:16 IST|Sakshi
'రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది'

హైదరాబాద్: మేడికొండూరు ఘటనపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ జె.వి.రాముడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. టీడీపీ కార్యకర్తలు తమపై దాడి చేసిన విధానాన్ని డీజీపీకి వివరించారు. ముప్పాళ్ల ఎంపీపీ అధ్యక్ష ఎన్నిక సందర్భంగా టీడీపీ నేతల దౌర్జన్యాన్ని డీజీపీకి వివరించినట్టు వైఎస్‌ఆర్ సీపీ నేతలు తెలిపారు. ఇప్పటిదాకా స్థానిక పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదని ఆరోపించారు.

పోలీసులపై అధికార పార్టీ నాయకులు ఒత్తిడి చేస్తున్నట్టు అనుమానించారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని విమర్శించారు. ఈ నెల 13న మేడికొండూరు వద్ద వైఎస్ఆర్ సీపీ నేతలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసి ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నికకు వెళ్తున్న ఎంపీటీసీలను కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు