'భూమాపై రౌడీషీట్ ఓపెన్ చేయటం అమానుషం'

4 Nov, 2014 14:01 IST|Sakshi

కర్నూలు : నంద్యాల వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై రౌడీషీట్ ఓపెన్ చేయటం అమానుషమని ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ టీడీపీ నేతలు, పోలీసులు కలిసి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అక్రమ కేసులు ఎత్తివేయాలని, లేకుంటే న్యాయ పోరాటానికైనా సిద్ధమేనని ఎస్వీ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. భూమా నాగిరెడ్డిపై పోలీసులు రెండు హత్యాయత్నం కేసులు, ఒక అట్రాసిటీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

 

మరిన్ని వార్తలు