త్వరలో బీపీఎల్‌ నుంచి ఏసీలు, ఫ్రిజ్‌లు

25 Feb, 2017 05:44 IST|Sakshi
త్వరలో బీపీఎల్‌ నుంచి ఏసీలు, ఫ్రిజ్‌లు

హైదరాబాద్‌: బీపీఎల్‌ కంపెనీ త్వరలో మైక్రో వేవ్‌ ఓవెన్‌లు, ఫ్రిజ్‌లు, ఎయిర్‌ కూలర్లు, ఏసీలను అందించనున్నది. ప్రస్తుతం తామందిస్తున్న ఎల్‌ఈడీ టీవీలు, వాషింగ్‌ మెషీన్లకు వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తోందని బీపీఎల్‌ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. తమ అంచనాలను మించి ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయం ఆర్జించబోతున్నామని బీపీఎల్‌ సీఎండీ అజిత్‌ నంబియార్‌ పేర్కొన్నారు.

కొత్తగా అందించనున్న ఓవెన్‌లు, ఏసీలు తదితర ఉత్పత్తులతో మూడేళ్లలో రూ.500 కోట్ల ఆదాయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ప్రస్తుతం 4 రకాల ఎల్‌ఈడీ టీవీలను, సెమీ, ఫుల్లీ ఆటోమేటిక్‌ వాషింగ్‌ మెషీన్లను విక్రయిస్తున్నామని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు