పీఎన్‌బీ స్కాం మాస్టర్‌మైండ్‌: కొన్ని వివరాలు

19 Feb, 2018 12:09 IST|Sakshi

సాక్షి, ముంబై: పీఎన్‌బీ కుంభకోణంలో కీలక  పాత్రధారి, ప్రధాన నిందితుడు,  బ్యాంకు మాజీ డిప్యూటీ మేనేజర్‌  గోకుల్‌నాథ్‌ శెట్టి గురించి అత్యంత ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఇప్పటికే శెట్టిని అరెస్ట్‌ చేసిన సీబీఐ  ఆధ్వర్యంలో విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలో సీబీఐ వర్గాలు  అందించిన  వివరాలు  ఇలా ఉన్నాయి.

  • 2015లో  వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ, గీతాంజలి  జెమ్స్‌ అధిపతి మోహుల్‌ చోక్సీని కలిశారు.
  • అదే  ఏడాది  ఖరీదైన  ఇల్లును కొనుగోలు  చేశాడు.  మలాద్‌ లింక్‌ రోడ్‌లో  సుమారు రూ. 4కోట్ల 4 బెడ్‌రూం ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు.
  • బోరివాలీలో మరొక ఇల్లు కూడా ఉంది, ప్రస్తుతం ఇది అద్దెకు ఇచ్చారు.
  • అంతేకాదు తన పూర్వీకుల గ్రామంలో  శెట్టి పలు స్థలాలను కూడా కొనుగోలు చేశారు.
  • కర్నాటకలోని ముల్కిలో జన్మించిన గోకుల్‌నాథ్‌  శెట్టి 1981లో క్లర్క్‌గా పీఎన్‌బీలో జాయిన్‌ అయ్యాడు.
  • 2005లో పీఎన్‌బీ ముంబై బ్రాంచ్‌కు బదిలీ అయ్యారు. ఇక్కడే నీరవ్‌ మోదీ, చోక్సి ఖాతాలు ఉన్నాయి.
  • 11 ఏళ్ళ సర్వీసు అనంతరం  ఒక్కసారి మాత్రమే ప్రమోషన్ తీసుకున్నాడు.
  • అదీ  దీర్ఘకాలం క్లర్క్‌గా  పనిచేసిన తరువాత,  నేరుగా డిప్యూటీ మేనేజర్‌ స్థాయికి  చేరుకున్నాడు. 
  • నిబంధనల ప్రకారం 2010లో బదిలీ జరగాల్సి ఉన్నా..2017లో రిటైర్‌ అయ్యేదాకా అదే పదవిలో కొనసాగడం గమనార్హం. 
మరిన్ని వార్తలు