హెచ్‌పీ నుంచి కొత్త తరం ప్రింటర్లు

15 Oct, 2014 01:14 IST|Sakshi
హెచ్‌పీ నుంచి కొత్త తరం ప్రింటర్లు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ కంపెనీ హ్యూలెట్ ప్యాకర్డ్(హెచ్‌పీ) నూతన తరం లేజర్ జెట్ మల్టీఫంక్షన్ ప్రింటర్లను భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. మూడు రకాల సిరీస్‌లో తయారైన ఈ ప్రింటర్ల ధరలు రూ.10 వేల నుంచి ప్రారంభమై రూ.3.35 లక్షల వరకు ఉన్నాయి. చిన్న, మధ్యతరహా కంపెనీలు, వాణిజ్య సంస్థలను ల క్ష్యంగా చేసుకుని వీటిని రూపొందించామని హెచ్‌పీ ఇండియా ప్రింటింగ్ సిస్టమ్స్ కేటగిరీ లీడర్ పరీక్షత్ సింగ్ తోమర్ మంగళవారమిక్కడ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు.

స్కాన్ చేసిన పీడీఎఫ్ కాపీలను ఎడిట్ చేసుకునే వీలు, సెక్యూరిటీ పిన్ ఇచ్చాకే ముద్రణ రావడం వంటి ఫీచర్లను ప్రింటర్లలో పొందుపరిచారు. ఎం630 సిరీస్ ప్రింటర్ల ధర రూ.2.34-3.35 లక్షల మధ్య ఉంది. ఇందులోని నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్‌తో ఐఫోన్6, ఆన్‌డ్రాయిడ్ కిట్‌క్యాట్ ఓఎస్‌తో రూపొందిన స్మార్ట్‌ఫోన్ల నుంచి డాక్యుమెంట్లను ప్రింట్ ఇవ్వొచ్చు. నకిలీ టోనర్ కార్‌ట్రిడ్జ్‌లకు అడ్డుకట్ట వేయడానికి కొత్త లేబుల్‌ను కంపెనీ పరిచయం చేసింది.

మరిన్ని వార్తలు