న్యూఢిల్లీ: హెచ్పీ సంస్థ రీఫర్బిష్డ్ (మరమ్మతులు చేసి పునర్వినియోగానికి అనుకూలంగా మార్చిన) ల్యాప్టాప్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. స్టార్టప్లు, ఫ్రీలాన్సర్లు, విద్యార్థులు, సూక్ష్మ, చిన్న వ్యాపార సంస్థలకు అందుబాటు ధరలకే ల్యాప్టాప్లు అందించే లక్ష్యంతో వీటిని తీసుకొచి్చనట్టు తెలిపింది.
హెచ్పీ ధ్రువీకృత భాగస్వాములు రీఫర్బిష్డ్ ల్యాప్టాప్లను రిటైల్ కస్టమర్లు, వ్యాపార సంస్థలకు విక్రయించనున్నట్టు ప్రకటించింది. విక్రయానంతర సేవలను కూడా వారే అందిస్తారని తెలిపింది.