హెచ్‌టీసీ ‘యు–11’ @ రూ.51,990

17 Jun, 2017 01:04 IST|Sakshi
హెచ్‌టీసీ ‘యు–11’ @ రూ.51,990

తైవాన్‌కు చెందిన ప్రముఖ కన్సూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ ‘హెచ్‌టీసీ’ తాజాగా ‘యు–11’ అనే ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.51,990.  ఆండ్రాయిడ్‌ 7.1 నుగోట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై పనిచేసే యు–11 స్మార్ట్‌ఫోన్‌లో 5.5 అంగుళాల స్క్రీన్‌ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ వివరించింది. ఈ స్మార్ట్‌ఫోన్స్‌ జూన్‌ చివరి వారం నుంచి  ఆన్‌లైన్‌ చానళ్లతోపాటు రిటైల్‌ స్టోర్లలోనూ కస్టమర్లకు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

మరిన్ని వార్తలు