ముంబై: ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) చైర్మన్గా పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్, మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ మెహతా ఎంపికయ్యారు. 2018–19 కాలానికి ఈయనను చైర్మన్గా ఎంపిక చేసినట్లు నిర్వహణ కమిటీ ప్రకటించింది. ఐబీఏ డిప్యూటీ చైర్మన్గా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ దీనబంధు మొహపాత్రను ఎన్నుకున్నట్లు పేర్కొంది. అలాగే, ప్రస్తుతం డిప్యూటీ చైర్మన్లుగా ఉన్న ఎస్బీఐ కొత్త చైర్మన్ రజనీష్ కుమార్, ఫెడరల్ బ్యాంక్ ఎండీ శ్యామ్ శ్రీనివాసన్ యథావిధిగా కొనసాగుతారని వెల్లడించింది.