మెగా డీల్‌ : 4 ఫ్లాట్లు రూ. 240 కోట్లు

23 Feb, 2018 15:12 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, ముంబయి : స్ధిరాస్థి రంగంలో దేశంలోనే అతిపెద్ద డీల్‌ నమోదైంది. ముంబయిలోని నేపియన్‌ సీరోడ్‌లో వ్యాపార వర్గానికి చెందిన తపారియా కుటుంబం రూ 240 కోట్లతో ఓ రెసిడెన్షియల్‌ టవర్‌లో నాలుగు ఫ్లాట్లను సొంతం చేసుకుంది. ఈ లగ్జరీ టవర్‌లోని 28, 30వ అంతస్థుల మధ్య నాలుగు విలాసవంతమైన ఫ్లాట్లను కొనుగోలు చేసింది.

రున్వాల్‌ గ్రూప్‌ చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌లో ఒక్కో చదరపు అడుగును రూ 1.2 లక్షలకు విక్రయిస్తున్నారు. ఒక్కో ఫ్లాట్‌ వైశాల్యం 4500 చదరపు అడుగులు. 28 కార్లను పార్కింగ్‌ చేసుకునే సదుపాయం కల్పిస్తారు.కాగా, మూడేళ్ల కిందట తపారియా కుటుంబం తాము నిర్వహించే గర్భనిరోధక మాత్రల తయారీ కంపెనీ ఫేమీ కేర్‌ లిమిటెడ్‌ను రూ 4,600 కోట్లకు విక్రయించింది. 

మరిన్ని వార్తలు