రిలయన్స్‌ జియో మరో ఆఫర్‌

19 Jun, 2018 14:58 IST|Sakshi
రిలయన్స్‌ జియో (ఫైల్‌ ఫోటో)

రోజురోజుకి టెల్కోల మధ్య పోటీ తీవ్రతరమవుతోంది. ముఖ్యంగా రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ల మధ్య ఈ పోటీగా భారీగా ఉంది. తాజాగా 799 రూపాయలతో సరికొత్త ప్లాన్‌ను లాంచ్‌ చేసిన రిలయన్స్‌ జియో, వెంటనే మరో ఆఫర్‌ను ప్రకటించింది. తన 299 రూపాయల ప్యాక్‌ను సమీక్షిస్తున్నట్టు ప్రకటించింది. ఈ సమీక్షించిన ప్యాక్‌ కింద అదనంగా రోజుకు 1.5జీబీ డేటాను ఆఫర్‌ చేయనున్నట్టు రిలయన్స్‌ జియో పేర్కొంది. అంటే ఇన్ని రోజులు ఈ ప్యాక్‌పై రోజుకు 3 జీబీ డేటా అందుబాటులో ఉండగా.. ఇక నుంచి 4.5జీబీ డేటాను యూజర్లు పొందనున్నారు. దీంతో ఇక నుంచి జియో యూజర్లు రూ.299 ప్యాక్‌పై 28 రోజులకు 126 జీబీ డేటా పొందనున్నారు. 

ఈ ఆఫర్‌ కేవలం జూన్‌ 30 వరకే అందుబాటులో​ ఉండనుంది. ఎక్కువ డేటా ప్రయోజనాలతో పాటు అపరిమిత వాయిస్‌ కాల్స్‌(రోమింగ్‌తో కలిపి), రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లను కంపెనీ ఆఫర్‌ చేస్తోంది. ఈ కొత్త స్కీమ్‌ కింద రూ.149, రూ.349, రూ.399, రూ.449 ప్యాక్‌లపై రోజుకు 3 జీబీ డేటాను యూజర్లు పొందనున్నారు. అంతేకాక మైజియో యాప్‌పై ఫోన్‌పే వాలెట్‌ వాడే కస్టమర్లకు 300 రూపాయల కంటే ఎక్కువున్న అన్ని రీఛార్జ్‌లపై 100 రూపాయల డిస్కౌంట్‌ లభించనుంది. 300 రూపాయల కంటే తక్కువ మొత్తాల రీఛార్జ్‌లకు కేవలం 20 శాతం డిస్కౌంట్‌ను మాత్రమే జియో ఆఫర్‌ చేయనుంది. 

మరిన్ని వార్తలు