-
ఐటీ గ్రిడ్.. ప్రభుత్వ దుశ్చర్యే!
పట్నంబజారు(గుంటూరు): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం తప్ప, రాష్ట్ర, ప్రజా ప్రయోజనాలపై ఏనాడూ దృష్టి సారించలేదని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి విమర్శించారు. ఓట్లు, సీట్లు తప్ప చంద్రబాబుకు మరేమీ పట్టవని మండిపడ్డారు. నగరంలోని పట్టాభిపురంలో పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఐటీ కంపెనీలు లేకపోయినా తన కుమారుడు లోకేష్బాబుని ఐటీ మంత్రిని ఎందుకు చేశారో అప్పట్లో అర్ధం కాలేదన్నారు. ప్రస్తుతం హైదరాబాద్లోని ఐటీ గ్రిడ్ ద్వారా ఏపీ ప్రజలకు సంబంధించిన వ్యక్తగత వివరాలు, ఏ పార్టీకి చెందిన వారు... బ్యాంకు ఖాతాలు ఇవన్నీ బహిర్గతం కావటం ఆయనపై వస్తున్న అనుమానాలకు బలం చేకూరుతోందన్నారు. కేవలం ఎలాగైనా సరే 2019లో గెలవాలన్న ఉద్దేశంతో పల్స్ సర్వే, ప్రజా సర్వేలు అని పెట్టి వైఎస్సార్ సీపీకి సానుభూతిపరులుగా ఉన్న వారి ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.ఆధార్ నంబర్ల ఆధారంగా, బ్యాంకు అకౌంట్ల వివరాలు తీసుకుంటున్నారని, ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీకి సంబంధించిన వివరాలు బహిర్గతం అయిన విషయంపై తెలంగాణ ప్రభుత్వం విచారిస్తుంటే, చంద్రబాబు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. కచ్చితంగా ఇది ప్రభుత్వ కుట్రేనని, బాధ్యులైన వారిని తక్షణమే అరెస్ట్ చేసి, విచారించాల్సిన అవసరం ఉందన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ ఐటీ గ్రిడ్ సీఈవోకు మంత్రి లోకేష్కు మధ్య సత్సంబంధాలు ఉన్నాయని తెలుస్తోందని, మరోసారి చంద్రబాబు కుట్రలు బహిర్గతం అయ్యాయని దుయ్యబట్టారు. పార్టీ నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్గాంధీ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ గెలుస్తుందనే భయంతో ఇటువంటి కుట్రలకు నాంది పలికారని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు అప్రమత్తతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ ఏపీకి చెందిన వ్యక్తి రాష్ట్రానికి సంబంధించిన వారి వ్యక్తిగత సమాచారం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉందని తెలుసుకుని ఫిర్యాదు చేస్తే.,.అక్కడ ఏపీ పోలీసులకు పనేంటని ప్రశ్నించారు. హడావుడిగా ఇక్కడ మిస్సింగ్ కేసు కట్టించటంతో పాటు, ఫిర్యాదుదారుడిని భయపెట్టడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు హడావుడి చూస్తుంటే స్పష్టంగా ఐటీ గ్రిడ్కు ప్రభుత్వానికి సంబంధం ఉందనే తెలుస్తోందన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు అబ్దుల్ కర్నుమా, బొర్రా వెంకటేశ్వరరెడ్డి, అనుబంధ విభాగాల నేతలు యేటిగడ్డ బుజ్జి, తిప్పారెడ్డి రామకృష్ణారెడ్డి, మెట్టు వెంకటప్పారెడ్డి, జగన్కోటి, షేక్ రబ్బాని, పసుపులేటి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
రిలయన్స్ జియో మరో ఆఫర్
రోజురోజుకి టెల్కోల మధ్య పోటీ తీవ్రతరమవుతోంది. ముఖ్యంగా రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ల మధ్య ఈ పోటీగా భారీగా ఉంది. తాజాగా 799 రూపాయలతో సరికొత్త ప్లాన్ను లాంచ్ చేసిన రిలయన్స్ జియో, వెంటనే మరో ఆఫర్ను ప్రకటించింది. తన 299 రూపాయల ప్యాక్ను సమీక్షిస్తున్నట్టు ప్రకటించింది. ఈ సమీక్షించిన ప్యాక్ కింద అదనంగా రోజుకు 1.5జీబీ డేటాను ఆఫర్ చేయనున్నట్టు రిలయన్స్ జియో పేర్కొంది. అంటే ఇన్ని రోజులు ఈ ప్యాక్పై రోజుకు 3 జీబీ డేటా అందుబాటులో ఉండగా.. ఇక నుంచి 4.5జీబీ డేటాను యూజర్లు పొందనున్నారు. దీంతో ఇక నుంచి జియో యూజర్లు రూ.299 ప్యాక్పై 28 రోజులకు 126 జీబీ డేటా పొందనున్నారు. ఈ ఆఫర్ కేవలం జూన్ 30 వరకే అందుబాటులో ఉండనుంది. ఎక్కువ డేటా ప్రయోజనాలతో పాటు అపరిమిత వాయిస్ కాల్స్(రోమింగ్తో కలిపి), రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లను కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఈ కొత్త స్కీమ్ కింద రూ.149, రూ.349, రూ.399, రూ.449 ప్యాక్లపై రోజుకు 3 జీబీ డేటాను యూజర్లు పొందనున్నారు. అంతేకాక మైజియో యాప్పై ఫోన్పే వాలెట్ వాడే కస్టమర్లకు 300 రూపాయల కంటే ఎక్కువున్న అన్ని రీఛార్జ్లపై 100 రూపాయల డిస్కౌంట్ లభించనుంది. 300 రూపాయల కంటే తక్కువ మొత్తాల రీఛార్జ్లకు కేవలం 20 శాతం డిస్కౌంట్ను మాత్రమే జియో ఆఫర్ చేయనుంది. -
జియో ఎఫెక్ట్: వోడాఫోన్ కొత్త ఆఫర్
న్యూఢిల్లీ: సునామీలా దూసుకొచ్చిన రిలయన్స్ జియోకు కౌంటర్గా దేశీయ ప్రధాన టెలికాం ఆపరేటర్లు తన తారిఫ్లను, ఆఫర్లను ఎప్పటికపుడు సమీక్షించుకుంటున్నాయి. తద్వారా తమ కస్టమర్లను నిలుపుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా వోడాఫోన్ తన వినియోగదారులకు మరో కొత్త ప్లాన్ ప్రకటించింది. ఆకర్షణీయమైన మొబైల్ డేటా ఆఫర్లతో వస్తున్న జియోను ఎదుర్కొనే ప్రణాళికలో భాగంగా వోడాఫోన్ రూ.244 రీచార్జ్పై 70 జీబి 4 జీ డేటా అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని అందిస్తోంది. 70 రోజుల పాటు చెల్లుబాటయ్యేలా ఈ పథకాన్ని వినియోగదారులకు అందిస్తోంది. వోడాఫోన్ ఈ కొత్త ప్లాన్ రూ.244ల మొబైల్ డేటా ప్లాన్ కొత్త వినియోగదారులకు ప్రత్యేకంగా వర్తిస్తుంది. దీని ప్రకారం రోజుకు 1జీబీ డేటా ఉచితం. దీనికితోడు 70 రోజుల పాటు అపరిమిత కాలింగ్ సౌకర్యం పొందవచ్చు. రెండవ రీఛార్జి కోసం ఈ పథకంలో క్రొత్త వినియోగదారుడు అపరిమిత కాలింగ్ , డేటా సౌకర్యం కొనసాగుతుంది. అయితే ఈ ప్లాన్ చెల్లుబాటు 35 రోజులకు పరిమితం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘నల్లసూరీడు’పై నజర్
ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్..
10న జిల్లాకు ప్రియాంక గాంధీ రాక
కాంగ్రెస్తోనే కుల వృత్తులకు మహర్దశ
అంతటా యజ్ఞ సహిత యోగా నిర్వహించాలి
ముగిసిన హోం ఓటింగ్
జిల్లా రద్దు అంశంపై ఫోకస్..
మల్లారంలో నేరడిగొండవాసి హత్య
తప్పక చదవండి
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
Advertisement