లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

4 Feb, 2016 09:40 IST|Sakshi

ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభం అయ్యాయి.  మూడు రోజులుగా నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో మన స్టాక్ మార్కెట్ లాభాలతో ఆరంభమైంది. బీఎస్ఈ సెన్సెక్స్ ప్రారంభంలోనే  200 పాయింట్ల మేర లాభపడింది.  ఎన్ఎస్ఈ సూచి నిఫ్టీ 7వేల మార్క్ను దాటింది. మరోవైపు రూపాయి 31 పైసలు బలపడింది. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ ప్రస్తుతం 67.76గా ఉంది. ఆదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

 

మరిన్ని వార్తలు