సాక్షి మనీ మంత్ర: లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు

22 Nov, 2023 16:56 IST|Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాల్లో ట్రేడయ్యాయి. రోజంతా ఒడిదొడుకుల్లో కొనసాగిన మార్కెట్లు చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి.

మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 93 పాయింట్ల లాభపడగా, నిఫ్టీ 29 పాయింట్ల మేర పుంజుకుంది. అయితే బ్యాంక్ నిఫ్టీ సూచీ 240 పాయింట్ల నష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 144 పాయింట్ల లాభంలో ట్రేడయింది. 

ఎన్‌ఎస్‌ఈలో బీపీసీఎల్, సిప్లా, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, హీరో మోటార్స్, అపోలో హాస్పిటల్స్, పవర్ గ్రిడ్, టైటాన్, టెక్ మహీంద్రా, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎల్ టిఐఎమ్, హిందుస్థాన్ యూనీలివర్, టీసీఎస్, యూపీఎల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డీస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎల్ టి, సన్ ఫార్మా, టాటా కన్జూమర్, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఓఎన్జీసీ కంపెనీల షేర్లు లాభాల్లో ముగిశాయి.

ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, హిందాల్కొ, అదానీ ఎంటర్ ప్రైజెస్, మహీంద్రా అండ్ మహీంద్రా, జేఎస్డబ్ల్యూ స్టీల్, కోల్ ఇండియా, బ్రిటానియా, దివీస్ ల్యాబ్, మారుతీ, గ్రాసిమ్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐషర్ మోటార్స్, ఎయిర్ టెల్, ఏషియన్ పెయింట్స్, విప్రో, నెస్లే కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

మరిన్ని వార్తలు