-

భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్‌

3 Mar, 2020 15:59 IST|Sakshi

ముంబై : వారం రోజుల పతనాలకు బ్రేక్‌ వేస్తూ స్టాక్‌మార్కెట్లు మంగళవారం భారీగా లాభపడ్డాయి. మెటల్‌, ఫార్మా సహా అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల జోరు కనిపించింది. గ్లోబల్‌ మార్కెట్లు సైతం కరోనా భయాల నుంచి కోలుకోవడం మదుపుదారుల్లో సానుకూల సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. మొత్తంమీద బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 479 పాయింట్ల లాభంతో 38,623 పాయింట్ల వద్ద ముగియగా..170 పాయింట్లు పెరిగిన  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,303 పాయింట్ల వద్ద ముగిసింది.

చదవండి : రికవరీ కళకళ : సెన్సెక్స్‌ హై జంప్‌

మరిన్ని వార్తలు