ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ వేస్తూ సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా లాభంతో ఆరంభమయ్యాయి. సెన్సెక్స్ 103 పాయింట్ల లాభంతో 25,139 దగ్గర, నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో 7,643 పాయింట్ల దగ్గర ట్రేడవుతున్నాయి. ఆసియా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ఉన్నప్పటికీ మన స్టాక్ మార్కెట్లపై ఎలాంటి ప్రభావం లేదు. మరోవైపు అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్లో రూపాయి కొంచెం మెరుగుపడింది. 4 పైసలు లాభపడి 66.79 దగ్గర ట్రేడవుతోంది.