లాభాల్లో మార్కెట్లు

25 Apr, 2019 09:46 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమైనాయి. అనంతరం సానుకూలంగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌44 పాయింట్లు ఎగిసి 39099 వద్ద, నిఫ్టీ 20 పాయింట్లు లాభపడి 11746 వద్ద కొనసాగుతున్నాయి.   బ్యాంక్‌ నిఫ్టీ అప్‌ ట్రెండ్‌ కొనసాగుతోంది.  దాదాపు అన్ని రంగాలూ లభాల్లోనే ఉన్నాయి.  ఎస్‌బ్యాంకు టాప్‌ విన్నర్‌గా ఉంది.

జెట్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన  ఎస్‌బ్యాంకు టాప్‌ విన్నర్‌గా ఉంది. కొన్ని బోయింగ్‌ విమానాలను టేక్ఓవర్‌  చేయనుందన్న వార్తలతోస్పైస్‌ జెట్‌ షేర్‌ లాభపడుతుంది. మారుతి, ఇప్కా ల్యాబ్స్‌, టాటా స్టీల్‌, ఎం అండ్‌ ఎం ఫినాన్స్‌, బయోకాన్‌  ఈరోజు ఫలితాలను ప్రకటించనున్నాయి. 

అటు దేశీయ కరెన్సీ రూపాయి బలహీనంగా కొనసాగుతోంది. డాలరు మారకంలో 69.81 స్థాయివద్ద ట్రేడ్‌ అవుతోంది.

మరిన్ని వార్తలు