బీఎస్‌–6 సుజుకీ యాక్సెస్‌ 125 వచ్చేసింది

7 Jan, 2020 08:40 IST|Sakshi

ప్రారంభ ధర రూ. 64,800

న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ సుజుకీ మోటార్‌సైకిల్‌ ఇండియా (ఎస్‌ఎంఐపీఎల్‌).. భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌)–6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉన్న యాక్సెస్‌ 125 స్కూటర్‌ను సోమవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ అధునాతన మోడల్‌.. అల్లాయ్‌ డ్రమ్‌ బ్రేక్, అల్లాయ్‌ డిస్క్‌ బ్రేక్, స్టీల్‌ డ్రమ్‌ బ్రేక్‌ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. ఇందులో స్టాండర్డ్‌ వేరియంట్‌ ధర రూ. 64,800 (ఎక్స్‌షోరూం–ఢిల్లీ) వద్ద నిర్ణయించింది. స్పెషల్‌ ఎడిషన్‌ ధర రూ. 69,500గా కంపెనీ ప్రకటించింది.

ఈ సందర్భంగా సంస్థ ఎండీ కొయిచిరో హిరావ్‌ మాట్లాడుతూ.. ‘ఎస్‌ ఎంఐపీఎల్‌ వృద్ధి బాటలో ఈ స్కూటర్‌ పాత్ర కీలకంగా కొనసాగుతోంది. నూతన ఆవిష్కరణతో కస్టమర్ల అంచనాలను అందుకోగలమని భావిస్తున్నాం’ అని  వ్యాఖ్యానించా రు. ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా నూతన నిబంధనలు అమలుకానుండగా.. గడువు కంటే ముం దుగానే తాజా ఫ్యామిలీ స్కూటర్‌ను విడుదల చేయగలిగామని అన్నారు.  

మరిన్ని వార్తలు