బాలికకు మత్తు మందు ఇచ్చి.. దారుణం

21 Sep, 2018 09:47 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చండీగఢ్ : చెత్త పడేయ్యటానికి బయటకు వెళ్లిన పదహారేళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కొందరు దుండగులు. ఈ సంఘటన హర్యానాలోని చందుబుదేరాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చందుబుదేరా గ్రామానికి చెందిన ఓ బాలిక ఇంట్లోని చెత్త బయటపడేయ్యటానికి వెళ్లింది. చెత్త పడేసి ఇంటికి తిరిగి వస్తుండగా కొంతమంది దుండగులు బాలిక ఎదురుగా వచ్చి మత్తుమందు ఉంచిన గుడ్డముక్కతో స్పృహ కోల్పోయేలా చేశారు.

అనంతరం బాలికపై లైంగిక దాడికి పాల్పడి.. బాలికను ఊరికి దూరంగా పడేసి వెళ్లిపోయారు. చెత్త పడేయ్యటానికి వెళ్లిన బాలిక ఎంత సేపటికి ఇంటికి తిరిగి రాకపోవటంతో కుటుంబసభ్యులు వెతకటం ప్రారంభించారు. రాత్రి 8గంటల ప్రాంతంలో తమ కూతురు ఊరి చివర ఒంటరిగా కూర్చుని ఉందన్న సమాచారం అందుకుని అక్కడికి వెళ్లారు. గాయాలతో ఉన్న కూతుర్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా బాలికపై సామూహిక అత్యాచారం జరిగినట్లు వైద్యులు గుర్తించారు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  

మరిన్ని వార్తలు