ఆఫ్ఘనిస్తాన్ : కాబూల్ నగరంలోని సర్-ఇ- కారెజ్ మార్కెట్లో శుక్రవారం మధ్యాహ్నాం జరిగిన పేలుడులో ఏడుగురు మృతిచెందారు. మరో 9 మంది గాయపడ్డారు. ఎవరిని లక్ష్యంగా దాడి చేశారో ఇంత వరకూ తెలియరాలేదు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు. ఈ ఘటనలో మూడు వాహనాలు, చాలా దుకాణాలు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. గత నెల నవంబర్ 16న భద్రతా బలగాలను లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో ఎనిమిది పోలీసులతో కలిపి 15 మంది చనిపోయారు.