మహిళ స్నానం చేస్తుండగా వీడియో చిత్రీకరణ

22 Jul, 2020 10:58 IST|Sakshi

వాట్సాప్‌లో పోస్టు.. ఆటోడ్రైవర్‌పై కేసు

మంచిర్యాల,వేమనపల్లి: బాత్‌రూంలో స్నానం చేస్తున్న వివాహితను వీడియో తీసి వాట్సాప్‌లో పోస్టు చేసిన ఆటో డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రహీంపాషా తెలిపారు. ఆయన వివరాల ప్రకారం... సూరారం గ్రామానికి చెందిన రస్‌పెల్లి మధు ఆటోనడుపుకుంటూ చెడు  వ్యసనాలకు అలవాటుపడ్డాడు. అదే గ్రామానికి చెందిన లారీ డ్రైవర్‌గా పని చేసే వ్యక్తి భార్యతో చ నువుగా ఉంటూ రెండు రోజుల క్రితం ఆ బాత్‌రూంలో స్నానం చేస్తుండగా వీడియో తీశాడు. ఆ వీడియో క్లిప్పింగ్‌లను అడ్డు పెట్టుకొని అందరికి చూపిస్తానంటూ బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. వివాహితను శారీరకంగా లొంగదీసుకొని అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా స్నానం చేస్తుండగా తీసిన విడియోను వాట్సప్‌లో పెట్టడంతో బా ధితురాలు మంగళవారం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

మరిన్ని వార్తలు