వివాహమైన ఐదు రోజులకే నవవధువు ఆత్మహత్య

18 Apr, 2019 09:51 IST|Sakshi
మృతి చెందిన రాజ్యలక్ష్మి (ఫైల్‌)

తమిళనాడు, అన్నానగర్‌:  వివాహం జరిగిన ఐదు రోజులకే నవవధువు విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన కొట్టాయ్‌పట్టి సమీపంలో మంగళవారం జరిగింది, మదురై జిల్లా కొట్టాయ్‌పట్టి సమీపం వెళ్లాలపట్టి గ్రామానికి చెందిన ఒయ్యప్పన్‌ రైతు. ఇతని కుమార్తె రాజ్యలక్ష్మి (24). ఈమెకి శివగంగై జిల్లా ఎస్‌వీ మంగళంకు చెందిన వెళ్‌లైస్వామి కుమారుడు వీరపాండి (27)తో గత 10వ తేదీ వివాహం జరిగింది. వివాహం జరిగిన రోజు నుంచి దంపతుల మధ్య అభిప్రాయభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ స్థితిలో మంగళవారం వీరి మధ్య వాగ్వాదం ఏర్పడింది. దీంతో రాజ్యలక్ష్మిని వీరపాండి, వెళ్లాలపట్టిలో ఉన్న ఆమె పుట్టింట్లో వదలి వెళ్లాడు. ఈ క్రమంలో సమీపంలో ఉన్న తోటకి రాజ్యలక్ష్మి వెళ్లింది. అనుమానించిన ఆమె తల్లి పూంజోలై తోటకి వెళ్లి చూడగా రాజ్యలక్ష్మి విషం తాగి స్పృహతప్పి పడి ఉంది. వెంటనే తల్లిదండ్రులు ఆమెను మేలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే రాజ్యలక్ష్మి మృతి చెందింది. కొట్టామ్‌పట్టి పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. తన కుమార్తె మృతిపై అనుమానం ఉన్నట్లుగా రాజ్యలక్ష్మి తండ్రి ఒయ్యప్పన్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ప్రకారం పోలీసులు విచారణ చేస్తున్నారు. వివాహం జరిగిన 5వ రోజున నవవధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆ ప్రాంతాన్నే శోకంలో ముంచేసింది.

మరిన్ని వార్తలు