ఛాతీపై కాల్చుకున్నాడు..

15 May, 2020 20:36 IST|Sakshi

స్నేహితుడి భార్యపై మోజు

సాక్షి, న్యూఢిల్లీ : స్నేహితుడి భార్య తనతో వచ్చేందుకు నిరాకరించడంతో ఓ వ్యక్తి ఛాతీపై గన్‌తో కాల్చుకున్న ఘటన ఢిల్లీలో వెలుగుచూసింది. స్వర్ణ జయంతి విహార్‌ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో బుల్లెట్‌ గాయాలకు గురైన వ్యక్తిని విక్కీగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విక్కీ ప్రస్తుతం జైలులో ఉన్న తన స్నేహితుడు రమేష్‌ భార్యతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఈ క్రమంలో స్వర్ణజయంతి విహార్‌లోని పుట్టింట్లో ఉన్న ఆమె వద్దకు వెళ్లి తనతో వచ్చేయాలని కోరాడు. అందుకు ఆమె నిరాకరించడంతో తుపాకీతో తన ఛాతీకి గురిపెట్టి కాల్చుకున్నాడు. విక్కీ గొడవకు దిగడంతో ఢిల్లీ పోలీస్‌ హెల్ప్‌లైన్‌కు కాల్‌ చేసిన బాధితురాలు ఓ వ్యక్తి తుపాకీతో తనను బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకునే సమయానికి విక్కీ ఛాతీపై బుల్లెట్‌ గాయాలతో పడిఉన్నాడు. కాగా నిందితుడిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

చదవండి : బంధువుల ఇంటికెళ్లిందని గర్భిణి భార్యను..

మరిన్ని వార్తలు