విత్తన పంపిణీలో అపశృతి

13 Jul, 2018 13:19 IST|Sakshi

గంట్యాడ : ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో గురువారం జరిగిన విత్తనాల సరఫరాలో అపశృతి చోటుచేసుకుంది. బందోబస్తుకు వచ్చిన హెచ్‌సీ రామకృష్ణ అనుకోకుండా సెప్టిక్‌ ట్యాంక్‌లో పడిపోయారు. అయితే ఆ ట్యాంక్‌ వాడుకలోలేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది. పడిపోయిన హెచ్‌సీని అక్కడే ఉన్న ఎస్సై పి. నారాయణరావు, తదితరులు పైకి లాగి, ప్రథమ చికిత్స కోసం గంట్యాడ పీహెచ్‌సీకి తరలించారు.

>
మరిన్ని వార్తలు