నూజివీడులో ఘోరం

24 May, 2019 21:53 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నూజివీడు: కృష్ణా జిల్లా నూజివీడు మండలం వెంకటాయపాలెంలో ఘోరం చోటుచేసుకుంది. జీవితాంతం తోడుండాల్సిన భర్తే, భార్య పాలిట యముడయ్యాడు. స్థానికంగా నివాసం ఉంటున్న వీరయ్య, తన భార్య సత్యవాణీని హత్య చేశాడు. చున్నీతో ఊపిరాడకుండా చేసి చంపాడు. అనంతరం ఆ చున్నీని అత్తమామల ముఖం మీద కొట్టి మీ కూతురిని చంపేశానని చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఉన్నట్లుగా తెలిసింది. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారైన వీరయ్య కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని వార్తలు