ప్లేట్‌లో అన్నం తిన్నందుకే..

6 Jul, 2018 10:44 IST|Sakshi
నిందితుడు రాజేష్‌

వ్యక్తి దారుణ హత్య

ఉప్పల్‌: ఉప్పల్‌ ఎల్‌అండ్‌టీ కంపెనీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికుడిపై ఇద్దరు యువకులు దాడి చేసి అతి కిరాతకంగా హతమార్చిన సంగతి విదితమే. అయితే హత్య కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎల్‌అండ్‌టీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న రాజేష్‌ మహతో ఎల్‌అండ్‌టీ లేబర్‌ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇతని గది పక్కనే ఉంటున్న ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మంగరముండ (36) ఇదే కంపెనీలో కాంట్రాక్ట్‌ కార్మికునిగా పనిచేస్తున్నాడు.

ఈ నేపథ్యంలో ఒకరోజు మంగరముండ రాజేష్‌ ప్లేట్‌లో అన్నం వడ్డించుకొని తిన్నాడు. దీనిని జీర్ణించుకోలేని రాజేష్‌  బిహార్‌ రాష్ట్రానికి చెందిన వినోద్‌తో కలిసి మంగరముండను గత నెల 21న గడ్డిచేనులోకి తీసుకెళ్లి తీవ్రంగా గాయపరిచారు. అంతటితో ఆగక టవల్‌తో ఉరివేసి హత్య చేసి పారిపోయారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేశారు. నిందితుడు వినోద్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా వివరాలు వెల్లడించాడు. గురువారం రాజేష్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు