పంజాగుట్టలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

30 Jun, 2019 08:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని పంజాగుట్ట  ఫ్లై ఓవర్‌పై శనివారం అర్థరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. బేగంపేట నుంచి నాగార్జున సర్కిల్‌ వైపు వస్తున్న కారు, బైక్‌ ఢికొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న మహ్మద్‌ తాజుద్దీస్‌ అనే వ్యక్తి ఫ్లై ఓవర్‌ పై నుంచి కిందపడి మృతి చెందారు. మృతుడు నగరంలో ఓ పత్రికలో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు