ఖమ్మంలో కారు బోల్తా; ఒకరి మృతి

5 Nov, 2019 10:03 IST|Sakshi

సాక్షి, ఖమ్మం : ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మంచుకొండ వద్ద మంగళవారం కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. కాగా కారులో నిషేదిత గంజాయిని తరలిస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌ బానోత్‌ సురేందర్‌ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని నాలుగు క్వింటాళ్ల గంజాయిని స్వాదీనం చేసుకున్నారు. కేసును నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమ్మిత్తం మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు