ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

21 May, 2020 07:11 IST|Sakshi

సాక్షి, నల్గొండ: జిల్లాలోని చిట్యాల శివారులో ఉన్న రిలయన్స్ పెట్రోల్‌ బంక్ వద్ద గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన నిలుపుకొని ఉన్న ధాన్యం లారీని వెనక నుంచి ఓ ఎర్టీగా కారు ఢీకొట్టింది. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు కామినేని ఆస్పత్రికి తరలించారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి నుంచి హైదరాబాద్ వెళుతుండగా జాతీయ రహదారి (NH65)పై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. 

సంఘటన స్థలానికి చేరుకున్న నల్గొండ డిఎస్పీ వెంకటేశ్వరరెడ్డి  పంచనామా నిర్వహించి మృతదేహాలను నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన ముగ్గురు రాజమండ్రి దగ్గర కొత్తపల్లి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు క్షేమంగా ఉన్నారని పోలీసులు చెప్పారు. ప్రమాద సమయంలో కారులో మొత్తం ఎనిమిది మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు