యువతి ఫిర్యాదుతో నిందితుడి అరెస్టు
నాగోలు: వాట్సాప్ ద్యారా ఓ యువతికి సంబంధించిన ఫొటోలు పెడుతూ వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేసి బుధవారం రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం మంగళపేట చెందిన హోసాలి శివకుమార్ నగరంలోని బాలాపుర్లో ఓ రెస్టారెంట్లో బార్ వెయిటర్గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన యువతితో పరిచయమైంది. ఆమె పూర్తి వివరాలు సేకరించాడు. ఓ రోజు శివకుమార్ సదరు యువతి హోటల్కు తీసుకెళ్లి ఆమెకు మత్తుమందు కలిపిన కూల్డ్రింక్ ఇచ్చాడు. అనంతరం యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఫొటోలను తీశాడు. ఆ ఫొటోలు ఆమెకు చూపిస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఫొటోలను యువతి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పంపించసాగాడు. దీంతో బాధితురాలు రాచకొండ సైబర్ క్రైం పోలీసులు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రాచకొండ సైబర్ క్రైం సీఐ విజయ్కుమార్ దర్యాప్తు చేపట్టి సాంకేతిక ఆధారాలతో శివకుమార్ను బుధవారం అరెస్టు చేసి రిమాండ్ చేశారు.