పోస్టాఫీసుల్లో రూ. 1.40 కోట్ల మార్పిడి

14 Nov, 2016 00:09 IST|Sakshi
కర్నూలు (ఓల్డ్‌సిటీ): పోస్టాఫీసుల ద్వారా డివిజన్‌ పరిధిలో ఆదివారం రూ. 1.40 కోట్ల మేరకు నోట్లు మార్పిడి చేసినట్లు పోస్టల్‌ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ సి.హెచ్‌.శ్రీనివాస్‌ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒక్క హెడ్‌ పోస్టాఫీసులోనే రూ. 40 లక్షల మేరకు మార్పిడి చేశామన్నారు. సోమవారం గురునానక్‌ జయంతి సెలవు దినమైనా పోస్టాఫీసులు పనిచేస్తాయన్నారు. ఆదివారం ఎస్‌బీ ఖాతాలకు రూ. 4.79 కోట్ల డిపాజిట్లు జమ కావడంతో మొత్తం డిపాజిట్లు రూ. 35 కోట్లకు చేరాయని వివరించారు. 
 
మరిన్ని వార్తలు