గ్రూప్-2 కోసం అదనంగా 1000 బస్సులు

10 Nov, 2016 04:31 IST|Sakshi
గ్రూప్-2 కోసం అదనంగా 1000 బస్సులు

సాక్షి, హైదరాబాద్: ఈ నెల 11, 13 తేదీల్లో జరుగనున్న గ్రూపు-2 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం 1000 బస్సులు అదనంగా నడపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పురుషోత్తమ్ ఒక ప్రకటనలో  తెలిపారు. ఉదయం  9 గంటల నుంచి సాయంత్రం పరీక్షలు పూర్తి అయ్యే వరకు ఈ  బస్సులు అందుబాటులో ఉంటాయని, నగరంలోని అన్ని పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు రాకపోకలు సాగించేందుకు అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేస్తారని, ఎన్‌ఫోర్స్‌మెంట్ కోసం 6 జీపులలో ప్రత్యేక బృందాలు పని చేస్తాయని, బస్సుల సమాచారం కోసం కోఠి బస్‌స్టేషన్ 99592 26160, రేతిఫైల్ బస్‌స్టేషన్  99592 26154 నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు