శ్రీవారి మొక్కు తీర్చుకున్న అల్లు అర్జున్‌

6 Feb, 2017 10:22 IST|Sakshi

తిరుమల: ఏడుకొండలపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్‌ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

అల్లు అర్జున్‌, స్నేహ దంపతుల కూతరు అర్హ తలనీలాలలను స్వామివారికి సమర్పించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపం వద్ద వేద పండితులు బన్ని దంపతులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు.
 

>
మరిన్ని వార్తలు