మంత్రి కొల్లు రవీంద్రకు తృటిలో తప్పిన ప్రమాదం

6 May, 2016 04:25 IST|Sakshi
మంత్రి కొల్లు రవీంద్రకు తృటిలో తప్పిన ప్రమాదం

గుంటూరు నుంచి విజయవాడకు వెళుతుండగా బోల్తా పడిన కారు
రోడ్డుప్రమాదంలో మంత్రి కొల్లు రవీంద్ర కు స్వల్పగాయాలు
తాడేపల్లిలో మణిపాల్‌ ఆస్పత్రిలో చికిత్స
ప్రమాదంలో రవీంద్ర సహా నలుగురికి గాయాలు


గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు తృటిలో ప్రమాదం తప్పింది. ఎయిర్‌ బెలూన్స్‌ తెరుచుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గురువారం అర్థరాత్రి గుంటూరు నుంచి విజయవాడకు వెళుతుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు మంగళగిరి మండలం టోల్‌ప్లాజా వద్ద పల్టీలు కొట్టింది.

ఈ రోడ్డు ప్రమాదంలో మంత్రి కొల్లు రవీంద్రకు స్వల్పగాయాలు అయినట్టు తెలిసింది. ఆయనతో పాటు మరో నలుగురికి కూడా గాయాలు కావడంతో వారికి తాడేపల్లి మణిపాల్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు